World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

మానవ మెస్సీయను నిరోధించే కల్పితం: మానవుడు తగినంతగా సరిపోడు

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉన్న క్రైస్తవుడు

యహువః రాజ్య సువార్తను అర్థం చేసుకున్న వారితో (బైబిల్‌లో అది స్థిరంగా నమోదు చేయబడినందున) నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది పాత మరియు క్రొత్త నిబంధనల యొక్క ఇతివృత్తం మరియు అది ప్రాథమికంగా ఇలా చెబుతోంది: తండ్రి అయిన ఒక్క వ్యక్తి, అనగా యహువః, ఈ పునరుద్ధరించబడిన భూమిపై తన రాజ్యాన్ని పునరుద్ధరించబోతున్నాడు, అక్కడ ఈ రాజ్యాన్ని అంగీకరించే జనులు నివసించగలరు. వారివి జీవించడానికి ఉద్దేశించబడిన జీవితాలు మరియు వారు ఉద్దేశించబడిన వ్యక్తులు. ఆ రాజ్యం ఈ ప్రస్తుత యుగం చివరిలో నజరేతుకు చెందిన యహూషువః ద్వారా పునరుద్ధరించబడబోతోంది, ఆయన అద్భుతంగా గర్భం ధరింపబడడం/పవిత్రాత్మను పొందడం ద్వారా యహువః కుమారుడాయెను (లూకా 1:35), అందువలన ఆయన ప్రవచించబడిన మానవ మెస్సీయ మరియు ఇప్పుడు యహువః కుడి పార్శ్వమున మహిమపరచబడెను (కీర్త. 110:1; 1 తిమో. 2:5).

యహువః రాజ్యం ఈ ప్రస్తుత యుగం చివరిలో నజరేతుకు చెందిన యహూషువః ద్వారా పునరుద్ధరించబడబోతోంది, ఆయన అద్భుతంగా గర్భం ధరించబడడం/పవిత్రాత్మను పొందడం ద్వారా యహువః కుమారుడాయెను (లూకా 1:35), అందువలన ఆయన ప్రవచించబడిన మానవ మెస్సీయ మరియు ఇప్పుడు యహువః కుడి పార్శ్వమున మహిమపరచబడెను (కీర్త. 110:1; 1 తిమో. 2:5).

మానవ మెస్సీయను నిరోధించే కల్పితం: మానవుడు తగినంతగా సరిపోడు image

ఆయన తిరిగి వచ్చి యెరూషలేములో ప్రధాన కార్యాలయం ఉండే ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు మరియు ప్రతి ఒక్కరూ తన ప్రేమపూర్వక పాలనలోకి తీసుకురాబడే సమయం వరకు పరిశుద్ధులతో వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ సమయంలో తాను ఈ ప్రణాళికను అమలు చేయడానికి తనకు అధికారం మరియు శక్తిని ఇచ్చిన తన తండ్రికి సమస్తమును అప్పగిస్తాడు మరియు కొత్త ఆకాశం మరియు కొత్త భూమి స్థాపించబడతాయి (1 కొరిం. 15:28).

కాబట్టి మళ్ళీ, ఈ రాజ్య సువార్త స్వభావాన్ని అర్థం చేసుకున్న మీతో నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ప్రధాన స్రవంతి అయిన సనాతన క్రైస్తవ మతం ప్రవచించబడిన మెస్సీయ, యహూషువః, ఒక మానవుడు అనే అత్యంత స్థిరమైన బైబిల్ బోధనను అంగీకరించకుండా దానికి బదులుగా అతడు ముగ్గురు దేవుళ్ళ త్రిత్వములో పూర్వ-ఉనికిలో ఉన్న “దేవుడు” అని ఎందుకు బోధిస్తుందో నేను చాలా మందికి వివరించాలనుకుంటున్నాను. యహువః ఒక్కడే, ఆయన తండ్రి, అనే బోధ రాజ్య సువార్తలో ఎందుకు అంత ముఖ్యమైన అంశంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. త్రిత్వ సిద్ధాంతం యహువః రాజ్య సువార్త యొక్క మొత్తం బైబిల్ బోధనను గందరగోళపరచటమే కాకుండా, ఇది యహూషువఃను తప్పనిసరిగా మానవుడు కానివాడిగా చేస్తుంది.

నేడు కొద్దిమంది యహూషువఃను ఒక ప్రధాన మానవ కేంద్రం మరియు వ్యక్తిత్వం కలిగిన నిజమైన మానవుడు అని అంగీకరిస్తుండటం వాస్తవం. కొత్త నిబంధన సంఘం చేసింది, కానీ మనకు తెలిసినట్లుగా, 100 సంవత్సరాలలో గ్రీకు తత్వశాస్త్రం మరియు మానవ ఆలోచనలు కలిసి బైబిల్ ఏక దైవత్వాన్ని వక్రీకరించడం మరియు భర్తీ చేయడం ప్రారంభించాయి మరియు యహూషువఃను దేవునిలోని రెండవ వ్యక్తిగా మార్చాయి. ఇది ఎందుకు జరిగింది? ఇది చరిత్రలో ఎలా జరిగిందనేది నా ఉద్దేశ్యం కాదు. ఆ సమాచారమైతే చక్కగా నమోదు చేయబడింది. నా ఉద్దేశ్యం ఏమిటంటే, సత్యం నుండి ఈ నిష్క్రమణకు గల అంతిమ, అంతర్లీన ఆధ్యాత్మిక కారణం ఏమిటి? ఆశ్చర్యకరంగా, ఈ ప్రస్తుత ప్రపంచ క్రమం యొక్క మొదట్లో దానికి పునాది వేయబడినప్పుడు ఈ సమాధానం కనుగొనబడింది.

ఈ సమయంలోనే, యహువఃకు మరియు ఆయన స్వరూపంలో సృజించబడిన వారికి ప్రధాన శత్రువు అయిన సాతాను ద్వారా ఈ మోసం జరిగింది. ఈ అబద్ధం యొక్క స్వభావం పురుషులు మరియు స్త్రీల నుండి ఈ భూమిపై వారి ఉనికి ప్రారంభం నుండి దాచబడింది, అయితే ఈ అబద్ధం ఈ ప్రపంచ నాగరికత అంతా నిర్మించబడిన పునాదిని అందించింది. ఈ అబద్ధం నిజానికి మానవ రక్షకునిపై అపనమ్మకానికి వేదికగా నిలిచింది. కాబట్టి ఈ అబద్ధాన్ని మరింత పూర్తిగా బట్టబయలు చేసి, ప్రవక్తలు, యహూషువః మరియు అపొస్తలుల ద్వారా యహువః మనకు వెల్లడి చేసిన మొత్తం రాజ్య సందేశానికి ఇది పూర్తిగా ఎలా విరుద్ధంగా ఉందో చూపించడానికి ఇది సమయం అని నేను భావిస్తున్నాను.

బైబిల్ బోధిస్తున్నట్లుగా, యహూషువః తన తల్లి నుండి పుట్టిన పూర్తిగా మానవునిగా ఉన్న మెస్సీయ అని చెప్పే సిద్ధాంతాన్ని ప్రపంచం ఏమాత్రం సహించదు. ఇది ఈ యుగం యొక్క వ్యవస్థాపక వ్యవస్థలకు మద్దతిచ్చే బోధనకు వ్యతిరేకంగా ఉంటుంది.

మానవ మెస్సీయను నిరోధించే కల్పితం: మానవుడు తగినంతగా సరిపోడు image

ఈ ప్రస్తుత ప్రపంచం యొక్క తప్పుడు పునాది: మానవుడు తగినంతగా సరిపోడు. యహువఃకు కుమారునిగా లేదా కుమార్తెగా ఉండాల్సిన అవసరం మానవునికి లేదు. నేను మళ్ళీ చెబుతున్నాను: సాతాను ఈ భూలోక నివాసులను మోసగించాడు, మానవుడు సరిపోడు అని. మానవ చరిత్ర ప్రారంభం నుండి మనం నాగరికత అని పిలుస్తున్న ఈ మొత్తం నిర్మాణం ఈ తప్పుడు ఆవరణపై నిర్మించబడింది. బైబిల్ బోధిస్తున్నట్లుగా, యహూషువః తన తల్లి నుండి పుట్టిన పూర్తి మానవునిగా ఉన్న మెస్సీయ అని చెప్పే సిద్ధాంతాన్ని ప్రపంచం ఏమాత్రం సహించదు. ఇది ఈ యుగం యొక్క వ్యవస్థాపక వ్యవస్థలకు మద్దతిచ్చే బోధనకు వ్యతిరేకంగా ఉంటుంది. మానవ మెస్సీయకు చోటు లేదు, ఎందుకంటే ఇది మనం మానవ సామర్థ్యంవైపు చూసేలా చేస్తుంది మరియు సాతాను మనం చూడాలని కోరుకునే చివరి విషయం ఇదే. అతడు యహువఃకు మరియు యహువః యొక్క రూపంలో సృష్టించబడిన వారికి ప్రధాన శత్రువు, మరియు మానవ జాతిని పూర్తిగా నాశనం చేయడంలోనూ మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారి హృదయాలలో యహువఃను తక్కువ వానిగా చేయడంలోనూ ఏమాత్రం లోపం లేకుండా పనిచేస్తాడు. మానవులు సరిపోరు అనే బోధనపై ఆధారపడిన ఇదే ప్రపంచ వ్యవస్థ, ఆ మానవులు ఎందుకు సృష్టించబడ్డారనే విషయంలోను మరియు మహిమాన్వితమైన మానవులుగా మారే వారి అంతిమ సంభావ్యత (విశ్వాన్ని వారసత్వంగా పొందుతారు మరియు దేవదూతల రాజ్యంలో కూడా తీర్పు తీర్చువారిగా ఉంటారు) విషయంలోను ప్రజలను చీకటిలో ఉంచడానికి వివిధ మతపరమైన పథకాలను ముందుకు తెస్తూ రూపొందించిన వ్యవస్థ. ఈ ప్రపంచ క్రమం “ఈ యుగ సంబంధమైన దేవుత” (2 కొరి. 4:4), సాతాను, తనను తాను రక్షించుకోవడానికి తప్పనిసరిగా యహూషువఃను పూర్తిగా తిరస్కరించాలి లేదా విస్మరించాలి లేదా అతనిని నిత్యమూ ఉనికిలో ఉన్న దైవ-వ్యక్తిగా మార్చాలి. మానవ స్వభావంలో వచ్చాడు, కానీ వ్యక్తిగతంగా, 100% మానవుడు కాదు. యహూషువః నిజంగా ఎవరు (అప్పుడు) మరియు ఎవరు (ఇప్పుడు) అనే బైబిల్ సత్యంతో ఏకీభవించుట అనేది నేడు మనకు తెలిసిన నాగరికత ముగింపుకు మరియు చివరికి పూర్తి పతనానికి ప్రారంభం అవుతుంది. సాతాను లేదా ఈ యుగ శక్తులు అలా జరగడానికి ఇష్టపూర్వకంగా అనుమతించవు. అది ఆత్మహత్యా సదృశం అవుతుంది. కాబట్టి, మానవులకు విలువ ఇవ్వబడే కొత్త ప్రపంచ క్రమాన్ని ఏర్పాటు చేయుటకు యహువః తనకు ఇచ్చిన సమస్త మహిమతో యహూషువః తిరిగి వచ్చే వరకు, కావలసినది మానవులకు లేదు మరియు సరిపడదు అనే అబద్ధం ఉంటుంది మరియు కొనసాగుతుంది.

కాబట్టి, మానవ చరిత్ర యొక్క ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఇవన్నీ ఎలా ఏర్పాటు చేయబడ్డాయో చూద్దాం. ఏదేను తోట సంఘటనకు తిరిగి వెళ్దాం, ఇది ఆదికాండములోని మొదటి అధ్యాయాలలో నమోదు చేయబడింది. కథ అందరికీ తెలిసి ఉంటుందని భావిస్తున్నందున నేను ముఖ్య విషయాలను క్లుప్తంగా చూపబోతున్నాను.

1వ అధ్యాయంలోని చివరి వచనంలో, యహువః ఆదాము మరియు హవ్వలను సృష్టించడం పూర్తి చేసి, మిగతా వాటితో పాటుగా “చాలా మంచిదిగా నుండెను” అని చెప్పుటను మనం కనుగొన్నాము. యహువః ప్రకారం, కొత్తగా సృష్టించబడిన ఈ ఇద్దరు మానవులు ఖచ్చితంగా తగినంత మంచివారు మరియు ఆయన వారి కోసం సిద్ధం చేసిన రాజ్యాన్ని వారసత్వంగా పొందేందుకు కావలసినదాన్ని కలిగి ఉన్నారు, ఏలయనగా ఆయన వారికి భూమిని అప్పగించాడు మరియు దానిని లోబరచుకొనుడని నమ్మకంగా వారిని ప్రోత్సహించాడు. మరియు ఆదాము మరియు హవ్వలకు వారి అసంపూర్ణ మరియు అసమగ్రమైన యవ్వనం విషయంలో కూడా ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే 2:25 ప్రకారం, “వారిద్దరూ దిగంబరులుగా ఉన్నారు మరియు సిగ్గుపడలేదు.” వారు తమ తండ్రిలా పరిపూర్ణులు కాదు, కానీ అది వారికి సమస్య కాదు. అలాగని తండ్రికి కూడా ఇబ్బంది లేదు. అతని పిల్లలు చిన్నవారు, అసంపూర్ణంగా ఉన్నారు, అందువల్ల తండ్రివలె మరికాస్త ఎదిగే క్రమంలో ఉన్నారు, అయితే నైతికంగా పూర్తిగా ఎదిగి ఉన్నారని ఖచ్చితంగా లేదు. లూకా 18:19 లో యహూషువః చెప్పినట్లుగా, యహువః తప్ప ఎవరూ పుట్టుకతో మంచివారు కాదు మరియు తప్పుల నుండి మంచిని నేర్చుకోవాల్సిన అవసరం లేనివారు కాదు.

ఇద్దరు పిల్లలతో తండ్రి

ఇలాంటి సమయంలో, ఏదోను తోటలో మనకు కనిపించే నమ్మకమైన పరిస్థితి మరియు వాతావరణం మారిపోబోతున్నాయి. యహువః తన పిల్లలకు మంచి చెడులను తెలియజేసే వృక్ష ఫలములు తప్ప తోటలోని మరే చెట్టు ఫలాలైనను తినవచ్చని చెప్పాడు. ఇక్కడ మోసగాడైన సాతాను ప్రవేశిస్తాడు. అవిధేయత మరణానికి దారితీయదని 3:4-5 లో అతడు హవ్వకు చాకచక్యంగా సూచించాడు. ఆమె మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు పండ్లను తింటే, ఆమె సరైనదిగా మరియు మంచి చెడుల గురించి పూర్తి జ్ఞానం ఉన్న యహువఃలా ఉండవచ్చని మరియు ఆ జ్ఞానం ద్వారా మరణాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవచ్చని, మనిషి కంటే మెరుగైన జీవితం కలిగి ఉండి దాన్ని కొనసాగించవచ్చని బోధింపబడింది. ఇక్కడ అంతర్లీనంగా ఉన్న సందేశం ఏమిటంటే, మీరు అభివృద్ధి చెందుతున్న మానవునిగా కాకుండా మరొకటిగా మారినట్లయితే, యహువః మిమ్మల్ని అంగీకరిస్తాడు, విలువనిస్తాడు మరియు ప్రేమిస్తాడు. ఇప్పుడు, ఆదాము మరియు హవ్వ మానవులుగా ఉన్నారనేది నిజం, కానీ ఇందులో ఏదో తప్పు ఉందనేది నిజం కాదు. పిల్లలందరూ తప్పక అభివృద్ధి చెందాలి, అయితే తండ్రి తమను ప్రేమిస్తున్నాడనే నమ్మకంపై బంధం ఆధారపడి ఉంటే అది విజయవంతంగా ఆరోగ్యకరమైన మార్గంలో అభివృద్ధి చెందుతుంది. ఏ పిల్లలకైనా, వారి విషయంలో తల్లి లేదా తండ్రి యొక్క అభిప్రాయం చాలా ముఖ్యమైనది, అది క్రియాత్మక జీవితానికి గాని లేదా నిష్క్రియాత్మక జీవితానికి గాని పునాది వేస్తుంది. మరియు ఇక్కడ మనం సాతానుని సూచిస్తున్నాము, వారు ఎదుగుతున్న మానవులు కాకుండా వేరే వారిగా ఉన్నట్లైతే వారి తండ్రి వారి పట్ల సంతోషించనంతగా సంతోషించలేడు.

మరి వీటన్నింటి వలన ఏమి జరిగింది? మనం ఊహించినట్లుగానే: “ఇద్దరి కళ్ళు తెరవబడ్డాయి మరియు వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకున్నారు” (3: 7). తద్వారా ఇప్పుడు వారు ఎవరివలె సృష్టించబడ్డారనే విషయంలో సిగ్గుపడుతున్నారు, వారి దిగంబరత్వం గురించి సిగ్గుపడుతున్నారు, వారి అసంపూర్ణతకు సిగ్గుపడుతున్నారు, మంచి మరియు చెడుల గురించి కొత్తగా సంపాదించిన సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించగల సామర్థ్యం లేని మానవులుగా సిగ్గుపడుతున్నారు. వారు ఇప్పుడు ధర్మం యొక్క క్రియల ద్వారా తమను తాము నిరూపించుకొనుటకు ప్రయత్నించినప్పుడు వారు చూడగలిగినదంతా, వారి స్వంత అసంపూర్ణత మరియు యహువః ప్రమాణాలకు అనుగుణంగా జీవించలేని అసమర్థతను మాత్రమే. యహువః వలె తక్షణమే పరిపూర్ణులుగా ఉండాలని ఎప్పుడూ వారు ఉద్దేశించబడలేదు, కానీ వారు అలా ఉండాలని ఎవరో వారికి చెప్పారు. వారు ఆ అబద్ధాన్ని అంగీకరించినప్పుడు వారు తక్షణమే స్వీయ-శిక్ష/ఖండనలోకి దిగారు. మరియు దీని గురించి యహువః ఏమి చెప్పాడు? “నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పినవారెవరు?” మరో మాటలో చెప్పాలంటే, దిగంబరిగా ఉండటం అవమానకరమైన విషయం అని మీకు ఎవరు చెప్పారు?

తమ సిగ్గు ఫలితంగా, వారు ఇతరుల నుండి మరియు యహువః నుండి దాక్కున్నారు (3:7-8). ఇక అప్పటి నుంచి మనమంతా పరిగెడుతూ దాక్కుంటున్నామని మీకు తెలుసు. చాలా మంది తమను చూసి సిగ్గుపడతారు. మరియు అభద్రతా భావం గల తల్లిదండ్రులు, కించపరిచే సమాజ నిబంధనలు, మరియు ఖండించే మతాల వంటివన్నీ కూడా తమ వంతు కృషి చేశాయి, యహువః నియమించిన తమ విధిని గ్రహించే మానవులుగా ఉండకుండా మనల్ని ఉంచారు.

కానీ యహువఃకు ధన్యవాదాలు, ఆయన తన సత్యాన్ని నొక్కిచెప్పడాన్ని ఎప్పుడూ వదులుకోలేదు, “మానవుడిగా ఉండటం” అనేది ఆయన సృజనాత్మక ఆలోచన యొక్క పరాకాష్ట. బైబిల్ యొక్క ప్రధాన ఇతివృత్తం ద్వారా, అనగా రాబోయే యహువః రాజ్యాన్ని గూర్చిన సువార్త ద్వారా మన మానవ సామర్థ్యాన్ని సాధించమని ఆయన మనల్ని ప్రోత్సహించాడు. ఆ సందేశంలో భాగంగా, దేవుడు ఒక్కడే అని, అది ఆయనే అని, మనం కాదని పదే పదే చెబుతున్నాడు. ఆ భారాన్ని మనం మోయాల్సిన అవసరం లేదు. మనం మానవునిగా ఉంటే ఆయనకు చాలు — ఆయన అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కోరలేదు. రెండవది, ఆయన మొదటి ఆదాము వలె పూర్తిగా మానవుడిగా ఉండే రెండవ ఆదామును సృష్టించాలని ఆలోచన చేసాడు, అయితే ఈసారి శత్రువు యొక్క సూక్ష్మబేధాలకు అతడు పడిపోడు మరియు మొదటి మహిమాన్వితమైన, అమరత్వం పొందిన మానవుడిగా బలంగా ఉంటాడు. ఈ మెస్సీయ చాలా మంది సహోదరులలో మొదటి సంతానం మరియు మానవులందరి కొరకు స్వస్థత మరియు శాంతి గల కొత్త యుగానికి నాంది పలికాడు. చివరికి ప్రజలు యహువః ఉద్దేశించిన విధంగా జీవించగలరు మరియు వారు ఆయన ఉద్దేశించిన వ్యక్తులుగా ఉండగలరు. అది నెరవేరుటకు అన్ని సవాళ్లను మరియు అవకాశాలను అందించుటకు యహువః సృష్టించిన గ్రహం మీద ఇక్కడే మానవ సామర్థ్యం కనుగొనబడుతుంది.

తండ్రి మరియు కొడుకు

మనము పాత మరియు క్రొత్త నిబంధనల నుండి మొత్తం రాజ్య సందేశాన్ని వింటున్నప్పుడు, మనం సందేశంలోని సందేశాన్ని వింటాము. మన తండ్రి యహువః యొక్క మానవ బిడ్డలమైన మనం, మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపడం వల్ల ఆయన కనుగ్రుడ్డు కాలేదు. ధర్మశాస్త్రం వలనైన క్రియల ద్వారా నీతి రాదు. ఈ విధంగా మనం విలువను లేదా ప్రేమను పొందలేము. బదులుగా, మన ప్రేమగల తండ్రికి ప్రత్యేకమైన మధ్యవర్తి అయిన యహూషువః ద్వారా బోధించబడిన సువార్త సందేశం ద్వారా ఇవ్వబడిన వాగ్దానాలపై మన క్రియాత్మక విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ రాజ్య సువార్త అబ్రాహాము విశ్వసించిన సందేశం, మరియు బైబిల్ చెప్పినట్లుగా, ఆ విశ్వాసం అతన్ని నీతిమంతుడిగా పరిగణించింది. ఇది యహువఃను సంతోషపరచే యహువః రాజ్య సందేశపు వాగ్దానంలోని విశ్వాసం యొక్క నీతి, మరియు అది మానవులమైన మనకు సరైన ఆలోచనను మరియు జీవించడానికి పునాదిని అందిస్తుంది. మనం మానవులుగా యహువఃకు ప్రీతిపాత్రులం మరియు ఆమోదయోగ్యంగా ఉన్నాము, మనం ఎప్పటికీ దేనినైనా తెలుసుకోవడం వల్లనో లేదా చేయగలిగినందు వల్లనో కాదు, కానీ మనం ప్రీతిపాత్రులుగా ఉన్నామని ఆయన చెప్పినందున. అన్నిటి కంటే ముందు, ఆయన మన తండ్రి. అందువలన మనం యహువః కుమారుడైన యహూషువః బోధించిన “విశ్వాస విధేయతకు” విధేయులవుతాము.

రాబోయే రాజ్య సందేశం యొక్క బైబిల్ బోధన మాత్రమే మన వ్యాధిగ్రస్త ఆలోచన మరియు జీవనం నుండి బయటపడే మార్గాన్ని అందిస్తుంది. ఈ సందేశాన్ని ప్రపంచంలోనికి తీసుకెళ్లేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి. ప్రస్తుతం అది అందించే స్వస్థత మోక్షాన్ని ప్రజలు అనుభవిస్తారు. యహువః సత్యానికి ఈ యుగములో సాక్షులు లేరని అది చెప్పలేదు. యహువః ఒక్కడైయున్న వ్యక్తి మరియు యహూషువః మానవ మెస్సీయ అనే ముఖ్యమైన అంశాలతో సహా రాజ్య సందేశం అనేది మన మానవ సామర్థ్యం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన ప్రాథమిక సమాచారం. అది లేకుండా, క్రియల యొక్క నీతి మరియు విశ్వాసం యొక్క నీతి అను రెండింటి మధ్యగల వ్యతిరేక భావనలను సరిగ్గా అర్థం చేసుకోలేము మరియు మతపరమైన “వ్యవస్థల” ద్వారా కూడా మనం మన పాపాలలో చిక్కుకుంటాము.

ప్రపంచ మత వ్యవస్థ మొత్తం మానవ మెస్సీయను అంగీకరించదు ఎందుకంటే ఈ మొత్తం యుగం యహువః దృష్టిలో మానవుడు సరిపోడు అనే తప్పుడు ఆవరణపై ఆధారపడి ఉంది. అందుకే సనాతన క్రైస్తవం తప్పనిసరిగా త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించాలి. అలా చేయకపోతే, అది ప్రస్తుత దుష్ట నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయడం అని అర్థం, మరియు ఈ వ్యవస్థ దాని స్వంత విధ్వంసాన్ని అనుమతించదు కాబట్టి నేను భయపడుతున్నాను. ఆత్మ యొక్క అమరత్వం వంటి ఇతర సిద్ధాంతాలు కూడా మానవుడు సరిపోడనే అబద్ధాన్ని బలపరుస్తున్నాయి. యహువః యొక్క సృష్టియైన, యహువః నుండి ప్రాణం పోసుకోబడిన మానవ భౌతిక శరీరం దానికదే చెడ్డది మరియు ఆ శరీరం మరణంతో త్యజించబడాలి అనేది ఈ అమర ఆత్మ సిద్ధాంతానికి ఆధారమైనది.

ఈ సువార్తను చివరి వరకు ప్రపంచానికి తెలియజేయడానికి మనం యహువః పనిని కొనసాగిద్దాం (మత్త. 24:14). సందేశంలోని సందేశం సరళమైనది, అయినప్పటికీ లోతైనది: నిజమైన మానవుడిగా ఉండుట యహువఃకు సరిపోతుంది. యథార్థమైన మానవుడు ఇప్పటికే అమరత్వాన్ని పొందాడు, అది మన కోసం యహువః సిద్ధపరచిన రాజ్యాన్ని వారసత్వంగా పొందినప్పుడు మనది కూడా అవుతుంది.

హ్యాపీ-క్యాంపర్


ఇది రాబిన్ టాడ్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.