World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

బైబిలును అధ్యయనం చేయడం ఎందుకు ముఖ్యం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

బైబిలును-అధ్యయనం-చేయడం-ఎందుకు-ముఖ్యం

“ఇది మన సంప్రదాయం” అని ఎల్లప్పుడూ ఎందుకు సమాధానం ఇస్తున్నారో మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా అడిగారా? ఉదాహరణకు ఈ కథను తీసుకోండి: ఒక చిన్న అమ్మాయి తన తల్లి రాత్రి భోజనానికి వేయించటం చూస్తుండగా, తన తల్లి చివరలను కత్తిరించడం గమనించింది. అది అమ్మాయికి ప్రశ్న కలిగించింది. పెనము దానికి సరిపడునంత పెద్దది, కాబట్టి చివరలను ఎందుకు కత్తిరించాల్సి వచ్చింది? ఆమె తన తల్లిని అడిగింది, “నువ్వు కాల్చేటప్పుడు చివరలను ఎందుకు కత్తిరిస్తున్నావు?” అయితే ఆమెకు ఇవ్వబడిన సమాధానం సంతృప్తికరంగా లేదు; ఆమె తల్లి, “నాకు తెలియదు; నా తల్లి ఇలానే కాల్చేది మరియు నేను ఆమె నుండి నేర్చుకున్నాను.” కాబట్టి ఆ చిన్నారి తన అమ్మమ్మ వద్దకు వెళ్లి అదే ప్రశ్న అడగగా అదే సమాధానం వచ్చింది. కొంత నిరాశతో ఆమె తన ముత్తమ్మమ్మ వద్దకు వెళ్లి, “నువ్వు కాల్చేటప్పుడు చివరలను ఎందుకు కత్తిరించేదానివి?” అని అడిగింది. ఆమె ముత్తమ్మ, “సరే, హనీ, చెప్తాను. అప్పటికి నాకు దానికి సరిపడేంత పెద్ద పెనము లేదు, అందువల్ల నేను చివరలను కత్తిరించాల్సి వచ్చింది” అని సమాధానం ఇచ్చింది.

వంటగదిలో మూడు తరాలు

ఇది బైబిల్‌తో ఎలా సంబంధం కలిగి ఉంది? సరళమైనది. నేటి క్రైస్తవులు అదే పని చేస్తున్నారు, కాల్చటంలో మాత్రమే కాదు. క్రైస్తవులు మనం “సాంప్రదాయ క్రైస్తవ మతం” అని పిలిచే వాటి విషయంలో పడిపోయారు, గొప్ప గొప్ప వారిపై ఆధారపడుతూ, వారు చెప్పేదాన్ని లేఖనాలతో తనిఖీ చేయకుండా ప్రజలు అంగీకరించే పరిస్థితి. ఇది ప్రమాదకరం. ప్లేటో, లూథర్ మరియు అగస్టిన్ మతంపై ఇంత ప్రభావాన్ని చూపారని మీరు ఎలా అనుకుంటున్నారు? ప్రజలు బైబిలుకు వ్యతిరేకంగా విన్నదాన్ని అవునో కాదో ధృవీకరించుకోలేదు. వారు నిష్క్రియాత్మకంగా మరియు మోసపూరితంగా మారారు మరియు దానిని సోమరితనం అని మనం అనవచ్చు!

బైబిలుతో స్త్రీమనం బైబిలు అధ్యయనం చేయకపోతే సాతాను మన ముందు ఉంచిన మోసాలలో మనం పడిపోతాము. ఈ యుగపు దేవుడైన సాతాను తన పనిలో మోసపూరిత మార్గాలను కలిగి ఉన్నాడు మరియు క్రైస్తవులకు సంబంధించి అతని గొప్ప సాధనం సంప్రదాయం. విత్తువాని యొక్క ఉపమానంలో (మత్త. 13, లూకా 8) సాతాను వచ్చి, త్రోవ పక్కన పడిన వారిపై దాడి చేసి, వారి నుండి విలువైన రక్షణ విత్తనాన్ని తీసుకుంటాడు, తద్వారా వారు యహూషువః వారికి బోధించిన సువార్త ప్రకారం మంచిని అర్థం చేసుకోలేరు మరియు నమ్మలేరు (లూకా 8:12 చూడండి). నిజంగా సాతాను యొక్క ప్రాధాన్యత యహూషువఃను తన బోధన నుండి వేరుచేయడం. బోధించబడుతున్న వాటిని గ్రంథంతో పోల్చి చూస్తూ మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి!

అపొస్తలుల కార్యములు 17: 11 లో, పౌలు తమకు బోధిస్తున్నది నిజమో కాదో తెలుసుకోవడానికి రోజూ బైబిలు అధ్యయనం చేసిన బెరయ సమాజం గురించి మనకు వివరించబడింది. పౌలును ఖండించాలనే ఉద్దేశ్యంతో బెరయ వారు అధ్యయనం చేసినప్పటికీ, వారి నిజాయితీ గల కృషి మరియు పౌలు యొక్క సత్యం ఫలితంగా వారు నిజమైన విశ్వాసులయ్యారు.

సంఘంలోనికి ఇప్పటివరకు ప్రవేశించిన కొన్ని మోసాలు ఏమిటి? దేహం నుండి వేరుగా ఉన్న ఆత్మలకు పరలోకం ఒక ప్రదేశం. మనం మరణించినప్పుడు పరలోకానికి వెళ్తామని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులకు స్వర్గంలో మేఘం లేదా కుర్చీ లేదా ఇంద్రధనస్సు వాగ్దానం చేయబడలేదు కాని భూమి, రాజ్యాలు, వారసులు మరియు ఇక్కడ భూమిపై పాలన వాగ్ధానం చేయబడెను (ప్రక. 5:10; మత్త. 5: 5). వారి రాజ్యం శాశ్వతంగా స్థిరపడుతుందని, వారు భూమి పునరుద్ధరించబడిన భూమిపై సమస్తం కలిగి ఉంటారని యహువః వారితో ఒడంబడిక చేసాడు. ఏదేమైనా, విలక్షణమైన “మంచి అనుభూతి” సందేశం ఇకపై ఈ అంశాన్ని నిమగ్నం చేయదు, ఎందుకంటే ఎవరైనా మరణించినప్పుడు వారు క్రీస్తు తిరిగి వచ్చేవరకు సమాధిలో (షీల్) పడుకోకుండా వెంటనే స్వర్గానికి వెళతారని చెప్పడం సులభం. “మరణించిన వారికి ఏమీ తెలియదు” (ప్రసంగి. 9: 5) అనే సాదా ప్రకటన పట్ల ఒకరి కుళ్ళును మూయించుట మరియు దీనికి విరుద్ధంగా ఎంచుకొనుటకు, అనగా చనిపోయినవారు స్వర్గంలో లేదా నరకంలో పూర్తిగా స్పృహలో ఉన్నారని నమ్మునట్లు మోసం చేయుట చాలా సులభం. ఇది సులభం, ఎందుకంటే ఇది సాంప్రదాయంగా ఉంటుంది.

అలాగే, యహువః ముగ్గురు లేదా త్రిత్వం అని చెప్పుట విపరీతమైనది! యహువః ముగ్గురు వ్యక్తులు అని బైబిల్లో ఎక్కడ చదువుతాము? ఎక్కడా లేదు, కానీ యహూషువః దేవుని కుమారుడని చెప్పే అనేక శ్లోకాలు ఉన్నాయి. యహువః లోకమును ఎంతగానో ప్రేమించి, తన అద్వితీయ కుమారుని లోకంలో జన్మింపజేసెనని యోహాను 3: 16 లో మనకు లేఖనాలను పంచుకోవటంబోధించబడింది. యహూషువః మరియు బైబిలు యొక్క గొప్ప విశ్వాసం, షెమా (ద్వితీ. 6: 4), యహువః ఒకే‌ ఒక్క ప్రభువు అని చెప్పెను. కాబట్టి యహువః రెండు లేదా మూడు ఉండకూడదు. యహువః ఒక్కడు మరియు ఆయన మన ద్వారా పనిచేసే క్రీస్తు ద్వారా పనిచేస్తాడు.

1 కొరింథీయులకు 15: 3-4 సువార్తను నిర్వచించటానికి ముఖ్యమైన వచనాలు. అయినప్పటికీ, సువార్తను నిర్వచించే అనేక ఇతర వచనాల నుండి అవి విడిపోకూడదు. పౌలు “మొదటి ప్రాముఖ్యత” గా మూడు విషయాలను జాబితా చేస్తున్నాడు. పౌలు ఖచ్చితంగా సువార్త నుండి రాజ్యాన్ని మినహాయించలేదు. తాను ఎందుకు పంపబడెనో లూకా 4:43 లో యహూషువః చెబుతున్నాడు: రాజ్య సువార్తను అందరికీ ప్రకటించడానికి (మత్త. 28:19, 20). యహువః కింద ఆయన చేసిన మొత్తం పని యొక్క అర్థం అది. క్రైస్తవ మతం ఈ రోజు లూకా 4:43 లో యహూషువః చెప్పినదానిని ప్రక్కన పెట్టెను. రాజ్యం యొక్క అంశం సంఘంలో “వెనుక వరుసలో” ఉంచబడింది. దేవుని రాజ్యం సువార్తను తెలియజేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా, క్రైస్తవులు యహూషువః మరణించెనని మరియు పునరుత్థానం చేయబడెనని మాత్రమే ప్రజలకు చెప్పడంపై దృష్టి పెట్టారు.

సంఘం లేదా సండే స్కూల్ నుండి మనం తప్పుగా తీసుకొని ఉండవచ్చు గానీ, కేవలం సిలువపై చనిపోవడానికి మాత్రమే యహూషువః పంపబడలేదని స్పష్టంగా తెలుస్తుంది. బదులుగా ఆయన యహువః యొక్క రాజ్య ప్రపంచ ప్రణాళికను (మార్కు 1:14, 15) గూర్చి ఇతరులకు చెప్పడానికి పంపబడ్డాడు, తద్వారా మనం పశ్చాత్తాపం చెందడం, అర్థం చేసుకోవడం మరియు నమ్మడం ద్వారా సిద్ధంగా ఉండగలము. ఆయన మరణ పునరుత్థానాలను గూర్చిన అదనపు సమాచారాన్ని తన రాజ్య సువార్తలో చేర్చుటకు ముందే చాలా కాలం యహూషువః సువార్తను బోధించాడు. (మత్త. 16:21).

మనం క్రీస్తు అనుచరులుగా ఉండాలంటే, ఆయన నిరంతరం సువార్తను బోధించే పనిలోనే ఉన్నారనే సందేశాన్ని మనం బోధిస్తున్నామా?

ఈ ముఖ్యమైన విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, WLC యొక్క కంటెంట్ డైరెక్టరీని సందర్శించండి: ట్రినిటీ (సిద్ధాంతపరమైన లోపం)


ఇది మిరాండా బాల్డ్విన్ రాసిన వ్యాసం. డబ్ల్యుఎల్సి వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.